Thursday, May 2, 2024

AP: టీడీపీ ఎంపీ అభ్యర్థికి తృటిలో తప్పిన ప్రమాదం..

శ్రీ సత్యసాయి బ్యూరో, ఏప్రిల్ 27 (ప్రభ న్యూస్): శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం లోక్ స‌భ‌ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బి.కె.పార్థసారథికి శనివారం ఉదయం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ‌బి.కె. అనంతపురం నుండి మడకశిరకు వెళ్తుండగా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రానికి సమీపాన గల ఎన్ హెచ్ 44 లో, హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద కారు ఉన్న పలంగా బ్రేక్ వేయడంతో వెనుక వైపు వస్తున్న పార్థసారథి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం వెనుక వైపు ఢీకొనడంతో బీకే వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.

అయితే అందులో ప్రయాణిస్తున్న పార్థసారధికి పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన తర్వాత ఎస్కార్ట్ వాహనం స్కార్పియోలో అక్కడి నుండి పార్థసారథి మడకశిరకు వెళ్లిపోయారు. చెన్నే కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement