Thursday, May 16, 2024

Peddapalli – సింగ‌రేణి ప్రాంతంలో మ‌రిన్ని ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తాం – మంత్రి దుద్దిళ్ల

పెద్ద‌ప‌ల్లి – కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సింగ‌రేణి కార్మికుల ఇన్ కమ్ ట్యాక్స్ స్లాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు… సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బొగ్గు ఉపరితల గని గేట్ మీటింగ్ లో మంత్రి మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామ‌ని హామీ ఇచ్చారు.. అలాగే , గడ్డం వంశీ కృష్ణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.

అనంతరం రామఖిల్లా సమీపంలో ఉపాధిహామీ కూలీలతో సమావేశం అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. ఎన్నికల కోడ్ రాకముందే ఉపాథి హామీ వేత‌నం పెంచాల‌నే ప్రతిపాదనలు పంపామని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పని దినాలతో పాటు వేతనాలను కూడా పెంచుతామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement