Friday, May 3, 2024

TS : భార్య చేతిలో భ‌ర్త హ‌తం

నిత్యం మద్యం సేవిస్తూ వేధిస్తున్న భర్తను భార్య హతమార్చింది. అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామం వడ్డెర కాలనీలో జరిగింది.వడ్డెరకాలం చెందిన బోధస్ లక్ష్మణ్‌ను భార్య బోదాస్ లక్ష్మి బండరాయితో తలపై మోది హత్య చేసింది.

- Advertisement -

లక్ష్మణ్ తన ఇంట్లోనే నిద్రిస్తుండగా ఈ దారుణానికి పాల్పడింది. ఇద్దరు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బోధస్ లక్ష్మణ్‌పై పలు కేసులు ఉన్నాయి. విషయం తెలిసిన మోపాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి లక్ష్మణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement