Friday, April 26, 2024

కరోనాకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు బలి

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులను కరోనా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు పోలీసులు, సచివాలయ ఉద్యోగులు కరోనాతో మృతి చెందగా.. తాజాగా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీ ఇంటెలిజెన్స్ ఎస్పీ రామ్ ప్రసాద్ కరోనా మృతి చెందారు. పోలీస్ శాఖలో సౌమ్యుడిగా, సమర్ధవంతమైన అధికారిగా మన్ననలు పొందిన రామ్ ప్రసాద్ కరోనా బారిన పడ్డారు. గత 10 రోజులుగా చికిత్స పొందుతున్న రామ్‌ ప్రసాద్ చివరకు కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు స‌చివాల‌యం ఉద్యోగి య‌స్ కిషోర్ కుమార్ కూడా కరోనాకు బలైయ్యారు. ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రి పేషిలో పని చేస్తున్న ఆయన.. కొద్ది రోజుల క్రితమే కరోనా బారిన పడ్డారు. మహమ్మారితో పోరాడి రాత్రి చ‌నిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు కరోనాతో మృతి చెందడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement