Thursday, April 25, 2024

ఫోన్స్ స్విచ్చాఫ్..3 వేల మంది కరోనా రోగులు అదృశ్యం

కరోనా సోకిన రోగుల ఆదృశ్యం కర్ణాటకలో కలకలం రేపుతోంది. బెంగళూరు నగరంలో కరోనా సోకిన 3 వేల మందికి పైగా వ్యక్తులు అదృశ్య అయినట్లు రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ వెల్లడించారు. వీరంతా తమ మొబైల్ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నారని, దీంతో వారి ఆచూకీ కనుక్కోవడం కష్టతరం అవుతోందని ఆయన అన్నారు. కరోనా సోకిన రోగులు వెంటనే హోం ఐసొలేషన్ లోకి వెళ్లాలని వేరే ఎవరితో కాంటాక్ట్ అవ్వొద్దని ఆయన అన్నారు. వీరందరూ ఎక్కడ ఉన్నారు? వరెవరిని కలుస్తున్నారన్న విషయాన్ని కనుక్కోవాలని పోలీసులను ఆదేశించామని అన్నారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున కరోనా బాధితులకు కావాల్సిన ఔషధాలను ఉచితంగానే అందిస్తున్నామని, 90 శాతం కేసులను నియంత్రణలోనే ఉంచుకున్నామని, అయితే, కరోనా తమకు సోకిందని తెలిసి కూడా బయట తిరుగుతూ ఉన్న వారితో సమస్య పెరుగుతోందని అన్నారు. ఇదే సమయంలో చాలా మంది వైరస్ సోకిన చాలా రోజుల తరువాత, పరిస్థితి విషమించిన దశలో ఆసుపత్రులకు వస్తున్నారని ఆయన అన్నారు.”నేను వారికి చేతులు జోడించి ఒకటే చెప్పాలని భావిస్తున్నాను. వారి చర్యల కారణంగానే కేసుల సంఖ్య పెరుగుతోంది. చివరి సమయంలో ఐసీయూ బెడ్ల కోసం రావడం చాలా తప్పు. ఆ పని చేయనే చేయవద్దు. చాలా మంది తమ ఆచూకీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. అదృశ్యమైన వారంతా ఇళ్లల్లో లేరు. వారెక్కడున్నారో తెలియడం లేదు. వెంటనే అందరూ వైద్యాధికారులను సంప్రదించాలి” అని ఆర్ అశోక్ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement