Saturday, April 27, 2024

బెంగాల్లో హింస‌ను నిర‌సిస్తూ క‌న్నా ధర్నా…

గుంటూరు – పశ్చిమబెంగాల్ లో బీజీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం గుంటూరు లో ధర్నా నిర్వ‌హించారు. ఈ ధర్నా కార్యక్రమంలో బీజీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు లు పాల్గొన్నారు. కవిడ్ నిబంధనల ప్రకారం కన్నా నివాసంలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల.నుంచి కర్ఫ్యూ అమలులో వుండటంతో అలోగానే ధర్నా కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ లో బీజీపీ కార్యకర్తలపై హింసాకాండకు పాల్పడటం దారుణమన్నారు. అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. బిజేపి కార్యకర్తలు, వారి ఆస్తులపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన గూండాలు దాడిచేయటం శోచనీయమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement