Friday, April 26, 2024

పశ్చిమ బెంగాల్ లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి: బిజెపి డిమాండ్

నెల్లూరు – పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుత పరిస్థితులు దేశ విభజన కాలం నాటి భయానక పరిస్థితులను తలపిస్తున్నాయ‌ని,. ప్రజలను రక్షించాల్సిన వారే కుట్రలకు పాల్పడుతున్నార‌ని నెల్లూరు రూరల్ మండల అధ్యక్షుడు చిలక ప్రవీణ్ కుమార్ అన్నారు. బెంగాల్ లో ఎన్నిక‌ల అనంత‌రం జరిగిన హింస‌ను నిర‌సిస్తూ బిజెపి జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు పేత్తిఖాన్ పేట లోని మండల కార్యాలయంలో బిజెపి శ్రేణులు ధ‌ర్నా నిర్వ‌హించారు.. ఈ సంద‌ర్బంగా ప్ర‌వీణ్ మాట్లాడుతూ, . బెంగాల్ లో రాజకీయ హింస, నియంతృత్వానికి వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేస్తాం అని ప్ర‌క‌టించారు. ఈ కార్యక్రమంలో లో ఏపీ లీగల్ కో కన్వీనర్ దాసరి రాజేంద్ర ప్రసాద్ గారు, నెల్లూరు జిల్లా కార్యదర్శి యకసిరి ఫణి రాజుగారు, కార్యకర్తలు ,పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement