Saturday, April 27, 2024

భారత్ బంద్ జయప్రదం చేయండి

దుగ్గిరాల – ప్రభుత్వ వ్యతిరేక విధానాలని నిరసిస్తూ ఈ నెల 26 న జరిగే భారత్ బందును జయప్రదం చేయాలని అఖిలపక్ష నేతలు కోరారు.సోమవారం స్థానిక టర్మరిక్ మర్చంట్ అసోషియేషన్ హాలులో జెట్టి.బాలరాజు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.నాయకులు భారత్ బంద్ వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ బిజేపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క పరిశ్రమ స్ధాపించకపోగా ఉన్నవాటిని ప్రవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నారని అన్నారు.రైతులకి నష్టం కలిగించే నల్లచట్టాలను తీసుకురావడము దేశానికి ఎంతో నష్టమన్నారు.మార్చి 26న దేశవ్యాప్తముగా జరిగే భారత బందును జయప్రదంచేయాలని కోరారు.కార్యక్రమంలో లలితానందప్రసాదు, వి.సాంబశివరావు,టి.వెంకటనారాయణ,వై.స్టాలన్ పి.పరశురామారావు, యం.నాగమల్లేశ్వరరావు బి.అమ్మిరెడ్డి, షేక్ కరీముల్లా, వై.బ్రహ్మేశ్వరరావు, జక్రయ్య, పలువురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement