Saturday, April 27, 2024

స‌ర్ప‌వ‌రం ర‌సాయిన ప‌రిశ్ర‌మ‌లో పేలుడు – ఇద్ద‌రు కార్మికులు దుర్మ‌ర‌ణం..

కాకినాడ: సర్పవరం రసాయన పరిశ్రమలో బాయిలర్‌  పేలిన ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు కార్మికులు మృతి చెందారు..మ‌రికొంద‌రు కార్మికులు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం.. నేటి మ‌ధ్యాహ్నం కార్మికులు విధుల‌లో ఉన్న స‌మ‌యంలో ఒక్క‌సారిగా బాయిల‌ర్ పేలిపోయింది.. ఈ పేలుడికి ఇద్ద‌రు కార్మికులు దుర్మ‌ర‌ణం చెందారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని హాస్ప‌ట‌ల్ చికిత్స కోసం త‌ర‌లించారు.. అగ్నిమాప‌క సిబ్బంది, పోలీసులు ప‌రిశ్ర‌మ వ‌ద్ద‌కు చేరుకున్నారు.. కాగా విష‌యం తెలుసుకున్న మంత్రి క‌న్న‌బాబు హుటాహుటిన ఫ్యాక్ట‌రీకి వ‌చ్చారు.. ప్ర‌మావ వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు.. కార్మ‌కుల‌తో ఆయ‌న మాట్లాడారు.. గాయ‌ప‌డిన వారికి మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement