Thursday, May 2, 2024

Manipur : మ‌రోసారి మిలిటెంట్ల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

మణిపూర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మొదలైన కుల హింస అంతం కావడం లేదు. దాదాపు ఏడాది కాలంగా చెదురుమదురు హింసాకాండలో మణిపూర్ రగిలిపోతోంది. తాజాగా ఇవాళ‌ మ‌రోసారి మణిపూర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన నరసేన ప్రాంతంలో చోటుచేసుకుంది.

- Advertisement -

కుకీ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. మణిపూర్‌లోని నరన్‌సేన ప్రాంతంలో తెల్లవారుజామున 2:15 గంటల మధ్య కుకీ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఇద్దరు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోయారని మణిపూర్ పోలీసులు ఈ సంఘటన గురించి సమాచారం ఇచ్చారు. ఈ సైనికులు రాష్ట్రంలోని బిష్ణుపూర్ జిల్లాలోని నరన్‌సేన ప్రాంతంలో మోహరించిన CRPF 128వ బెటాలియన్‌కు చెందినవారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement