Friday, May 17, 2024

Janasena: రోడ్డు ప్రమాదంలో రాయపాటి అరుణకు గాయాలు

బాప‌ట్ల జిల్లాలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణకు గాయాల‌య్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారు బాపట్ల జిల్లా రేణంగివరం వద్ద డివైడర్‌ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అరుణతో పాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స కోసం అరుణను ఒంగోలు కిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

ప్రకాశం జిల్లాకు చెందిన రాయపాటి అరుణను జనసేన అధికార ప్రతినిధిగా రెండేళ్ల క్రితం నియమించారు. అప్పటి నుంచి ఆమె పార్టీలో చాలా చురుకుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ విధానాలను జనాల్లోకి తీసుకెళ్ల‌డం నుంచి విమర్శలను ధీటుగా ఎదుర్కొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement