Thursday, May 2, 2024

AP : ఇవాళ వైసీపీ మేనిఫెస్టో విడ‌ద‌ల

వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై పూర్తి కసరత్తులు చేసింది. ఇవాళ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. 2019 ఎన్నికల్లో నవరత్నాలు పేరుతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఇప్పుడు కూడా సంక్షే పథకాలకు ప్రథాన్యత ఇస్తూ రెండు కీలక హామీలు ఇవ్వనున్నారు. మహిళలు, రైతులను ఆకర్షించే రెండు పథకాలు మేనిఫెస్టోలో ప్రధానంగా హైలెట్ చేయనున్నట్లు సమాచారం. అలాగే బీసీలను ఆకర్షించేలా ఓ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని హామీలు ఇవ్వకుండా కొద్ది మొత్తంలోనే పథకాలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించారని ఆ పార్టీలు నాయకులు చెప్పుకుంటున్నారు. కేవలం ఓ పాంప్లెట్ సైజులో నవరత్నాలను హైలెట్ చేస్తూ మేనిఫెస్టోను విడుదల చేయాలని అటు సీఎం జగన్ సైతం నిర్ణయించారట.

- Advertisement -

ఇప్పటికే అమలు చేస్తున్న కొన్ని పథకాలనూ యథావిధిగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారట. మరోసారి అధికారంలోకి వచ్చేలా సీఎం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే మేనిఫెస్టో విడుదలపై క్లారిటీ లేదు. విడుదల చేసే అవకాశం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కానీ అధికారికంగా శనివారం విడుదల చేస్తామని చెప్పలేదు. దీంతో మేనిఫెస్టో విడుదలపై కొంత గందరగోళం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement