Wednesday, May 8, 2024

నాలుగు ల‌క్ష‌ల మేజార్టీతో గురుమూర్తి గెలుపు ఖాయం..

శ్రీకాళహస్తి – తిరుపతి ఉప ఎన్నికలలో వైసిపి అభ్య‌ర్ధి డాక్టర్ గురుమూర్తి గారు 4 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం త‌ధ్య‌మ‌న్నారు ఎమ్ ఎల్ ఏ బియ్యపు మధుసూదన్ రెడ్డి . శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిరుపతి ఉప ఎన్నికలకు శ్రీకాళహస్తి మండల బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు.. వైసిపి అభ్య‌ర్ధి గురుమూర్తితో పాటు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నేడు ఈ స్థానానికి రావడానికి ముఖ్య కారణం ఆయన కష్టం, నిజాయితీ అన్నారు. . దేవుని దీవెనలతో జగనన్న ఆశీర్వాదంతో ఎంపీగా పోటీ చేస్తున్న మన డాక్టర్ కి మీ అందరి ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాన‌న్నారు.
అనంతరం ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ, నిరుపేద కుటుంబానికి చెందిన త‌న‌కు ఎంపి టిక్కెట్ ఇచ్చిన జగన్ అన్నకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాన‌న్నారు..తాను గెలిచిన వెంట‌నే శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తాన‌ని హామీ ఇచ్చారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement