Tuesday, May 14, 2024

ఇంటింటికీ అందుతున్న‌ పాలనా ఫలాలు… కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : పాలనా సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందుతున్నాయని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. బుధవారం 10వడివిజన్ వివేకానంద వీధిలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ తిరిగి వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్న తీరును అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలు గురించి చెబుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… అర్హత ఉండి పథకాలు ఏమైనా అందడం లేదా, ఇంకా ఏ యే సమస్యలున్నాయంటూ ప్రజలను అడిగి తెలుసుకుంటున్నామని వివరించారు.

రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమన్నారు. ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి అందరూ అండగా ఉండాలన్నారు. సంక్షేమ పాలన చూసి ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అర్హులందరికీ నిష్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ డాక్టర్ శిరీష, కార్పొరేటర్లు దొడ్డ రెడ్డి ప్రతాప్ రెడ్డి, దొడ్డ రెడ్డి ప్రవల్లిక రెడ్డి, రామస్వామి వెంకటేశ్వర్లు, కో ఆప్షన్ సభ్యులు రుద్ర రాజు శ్రీదేవి, వైఎస్ఆర్సిపి నాయకులు దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, శాంతా రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement