Friday, April 26, 2024

కోడి దాడి : యువ‌కుడి మృతి

కోడి దాడిలో యువ‌కుడు మృతిచెందిన విషాద ఘ‌ట‌న ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని తంబళ్ల పల్లిలో ఎవ‌రూ ఊహించని విధంగా ఘటన జ‌రిగింది. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దశదిన కర్మ సందర్భంగా కోడిపందేలను నిర్వహించారు. కోడి పందేలను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి అనేక మంది తరలివచ్చారు. అయితే కోడి పందేలు నిర్వహిస్తుండగా కోడి ఒక యువకుడిపై దాడి చేసింది. దీంతో యువకుడికి తీవ్ర గాయాలై మృతి చెందాడు. పందేలు చూస్తుండగా కోడి దాడిచేయడంతో కోడికి క‌ట్టిన‌ కత్తి తగిలి యువకుడు మరణించాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement