Tuesday, May 7, 2024

క్రికెటర్ రషీద్ కు శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత చదలవాడ

అండర్ 19 ప్రపంచ వరల్డ్ కప్ పోటీల్లో టీమ్ ఇండియా తరఫున నరసరావుపేట నియోజకవర్గానికి చెందిన షేక్ రషీద్ టీమిండియా వైస్ కెప్టెన్ గా ఉండటమే కాకుండా ఫైనల్స్ లో భారత్ ను గెలిపించాడు. ఆటలో ప్రత్యేకతను ప్రదర్శించి ఇండియా గెలుపులో విశేష కృషి చేసిన రషీద్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా.చదలవాడ అరవింద బాబు పేర్కొన్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయానికి ఆహ్వానించి క్రికెటర్ రషీద్ ను ఘనంగా సత్కరించనున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement