Thursday, May 2, 2024

జస్టిస్‌ కనగరాజు నియామకాన్ని సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

ఏపీ పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ వి.కనగరాజ్‌ నియామకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ జీవోను ఆరు వారాలపాటు నిలుపుదల చేస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీచేసింది. పోలీస్ కంప్లైంట్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్ నియామకాన్ని న్యాయవాది పారా కిషోర్ సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. జీవోను ఆరు వారాలు సస్పెండ్ చేసింది. కనగరాజు నియామకం చెల్లదని న్యాయస్థానం ప్రాథమికంగా అభిప్రాయపడింది. పిటిషనర్ తరపున న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించారు.

ఇది కూడా చదవండి: ఏపీ కేబినెట్‌..నిర్ణయాలివే..

Advertisement

తాజా వార్తలు

Advertisement