Saturday, April 20, 2024

మంత్రి కేటీఆర్‌కు కొత్త పేరు పెట్టిన రేవంత్ రెడ్డి

మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్ర‌భుత్వంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మ‌రోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఓ డ్రామారావ్ అంటూ రేవంత్ మండిప‌డ్డారు. స‌రైన స‌మాచారం లేని మంత్రి కేటీఆర్ మొన్న ఆరు ఏళ్ల పాప‌పై అఘాయిత్యం జ‌రిగిన‌ప్పుడే స‌రిగ్గా స్పందించి ఉంటే, ఈ రోజు మంగ‌ళ్ హాట్‌లో 9 ఏళ్ల పాప‌పై మ‌రో మృగాడు అఘాయిత్యానికి ప్ర‌య‌త్నించ‌క‌పోయేవాడ‌ని మండిప‌డ్డారు.

తెలంగాణ‌లో ఇప్పటివరకు టీఆర్ఎస్ పాలించిన ఏడు సంవ‌త్స‌రాలలో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు 300శాతం పెరిగాయ‌ని, ఇది మీ పాల‌న అని రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇందుకు సంబంధించిన పలు మీడియా క్లిప్‌లను కూడా త‌న ట్వీట్‌కు రేవంత్ రెడ్డి జ‌త చేశారు. కాగా గురువారం నాడు సైదాబాద్ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకోవడంతో పలువురు ప్రతిపక్షాల నేతలు ఈ ఘటన తెలంగాణ పోలీసుల వైఫల్యానికి సాక్ష్యమంటూ ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement