Monday, April 29, 2024

సోనూసూద్ ఇంటిపై రెండో రోజు ఐటీ రైడ్స్..

లాక్ డౌన్ రియల్ హీరో సోనూసూద్ ఇళ్లపై రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నిన్న అర్థరాత్రి వరకూ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై దాడులు చేసిన ఆదాయపు పన్ను అధికారులు.. ఈ ఉదయం ముంబైలోని అతని ఇంటికి వెళ్లారు. లక్నోకు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీతో సోనూ సూద్ ఆస్తి ఒప్పందంపై దర్యాప్తు చేస్తున్నారు. పన్ను ఎగవేసినట్లు అనుమానాలున్నాయని, అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించినట్లు ఐటీ అధికారులు తెలిపారు. నిన్న సోనూ సూద్ తో సంబంధం ఉన్న ఆరు ప్రదేశాలలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 20 గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. అయితే సోనూ నివాసం, కార్యాలయాలపై జరుగుతున్న తనిఖీలపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంతో మందికి సాయం చేసిన సోనూపై ఐటీ దాడులు జరగడం ఏంటని అభిమానులు ప్రశిస్తున్నారు. కాగా సోనూసుద్ కి సంబంధించిన ఆరు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: గుంటూరులో ‘బుల్లెట్ బండి’ సాంగ్‌కు డ్యాన్స్ వేసిన కార్మికులు

Advertisement

తాజా వార్తలు

Advertisement