Tuesday, May 14, 2024

ఈ నెల 21 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 21 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ రోజు సాయంత్రానికి నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది జగన్ సర్కార్. అయితే, ఎన్నిరోజులు సమావేశాలు పెట్టాలనే దానిపై బీఏసీ లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ఉభయ సభలు ధన్యవాదాలు తెలపనున్నాయి. అసెంబ్లీలో బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, మండలిలో చల్ల రామకృష్ణ రెడ్డిలకు సంతాపం ప్రకటించనున్నారు.

ఇదీ చదవండి: పిల్లలపై కొవాగ్జిన్​ ఫేజ్​-2 క్లీనికల్​ ట్రయల్స్

Advertisement

తాజా వార్తలు

Advertisement