Wednesday, May 15, 2024

కరోనా ఎఫెక్ట్: తిరుమల వెంకన్న ఆదాయం రూ.11 లక్షలు

కరోనా కారణంగా ఏపీ ప్రభుత్వం పలు ఆంక్షలు విధించిన కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. మంగళవారం తిరుమల శ్రీవారిని 2,500 లోపు మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేవలం 2,262 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మంగళవారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం 11 లక్షల రూపాయలు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. మరోవైపు నిన్న 925 మంది భక్తులు మాత్రమే స్వామివారికి తలనీలాలు సమర్పించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement