Friday, May 3, 2024

పిల్లలపై కొవాగ్జిన్​ ఫేజ్​-2 క్లీనికల్​ ట్రయల్స్

కరోనా కట్టడికి భారత్ బయోటెక్​ అభివృద్ది చేసిన దేశీయ టీకా కొవాగ్జిన్‌ను 2 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లలపై ఫేజ్​-2, ఫేజ్​-3 క్లీనికల్ ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ఎయిమ్స్​, పట్నా ఎయిమ్స్​, నాగ్‌పుర్ మెడిట్రినా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్‌లో దాదాపు 525 మందిపై క్లీనికల్ ట్రయల్స్ జరగనున్నాయి. ట్రయల్స్‌కు సంబంధించి భారత్‌ బయోటెక్ పెట్టుకున్న విజ్ఞాపనపై పూర్తి స్థాయి చర్చల అనంతరం కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్​సీఓ) నిపుణుల కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ ట్రయల్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలు ఫిబ్రవరి 24నే నిపుణుల కమిటీ ఎదుటకు వచ్చాయి. అయితే ఈ ట్రయల్స్‌కు సంబంధించిన రివైజెడ్​ క్లీనికల్​ ట్రయల్​ ప్రొటోకాల్​ సమర్పించాలని నిపుణుల కమిటీ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement