Thursday, April 25, 2024

మెడికల్ కళాశాల నిర్మాణానికి రూ.505 కోట్లు కేటాయింపు

బాపట్ల టౌన్ – పట్టణంలో త్వరలో నిర్మించనున్న మెడికల్ కళాశాలకు రూ 505 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఉప సభాపతి కోన రఘుపతి తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కళాశాల నిర్మాణం కు రూ 475 కోట్లు కేటాయించగా మరో 30 కోట్లు అదనంగా కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కోరిన వెంటనే నిధులు కేటాయించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. మెడికల్ కళాశాల వ్యవహారం న్యాయపరమైన అనుమతులు పూర్తి చేసుకొని టెండర్ల దశకు వచ్చిందని,జూన్ నెలలో శంకుస్థాపన పనులు కూడా చేపట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు.కళాశాల నిర్మాణం తో బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతుందని పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement