Thursday, May 2, 2024

కరోనా రోగులకు రెడ్ క్రాస్ ఉచితంగా భోజనం…

గుంటూరు మెడికల్ – కరోన దృష్ట్యా సర్వ జన ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులను ఆదుకునేందుకు రెడ్ క్రాస్ జిల్లా శాఖ ముందుకు వచ్చింది. భోజనం అందక అనేకమంది బాధితులు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు రామచంద్ర రాజు ప్రతి రోజు ఆసుపత్రిలో భోజన సదుపాయాన్నీ ఏర్పాటు చేశారు. గత మూడు రోజుల నుంచి ఆర్ధోపెడిక్ వార్డు వద్ద ఫ్రీ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసి రోగుల సహాయకుల కు భోజనాలను అందిస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి ఫుడ్ కోర్ట్ ను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.రుచిగా శుచిగా సామాజిక దూరం పాటిస్తూ హాండ్ మైకుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం అభినందనీయమని డాక్టర్ ప్రభావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎఫ్ ఓ వెంకటేశ్వర్లు, లాయర్ కిషోర్, రమేష్ జైన్, శ్రీహరి, చైతన్య, శివ మోహన్ రావు, అంబటి గోపికృష్ణ, సింగరాజు, పవన్, రసూల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement