Friday, April 26, 2024

AP Corona: ఏపీలో 14 వేలు దాటిన కోవిడ్ కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 40,266 మంది శాంపిల్స్ ని పరీక్షించగా.. కొత్తగా 14,502 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కోవిడ్ తో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. గడిచిన 24 గంటల్లో 4,800 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,95,136కి చేరింది. ఇందులో 20,87,282 మంది బాధితులు వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 93,305 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివవరకు కోవిడ్ తో 14,549 మంది మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement