Saturday, April 20, 2024

పొదిలిలో దంపతుల ఆత్మహత్యాయత్నం

ప్రకాశం : ప్రకాశం జిల్లా పొదిలిలో దంపతులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. స్థానిక ఏబీఎం కాంపౌండ్ వద్ద నివాసముంటున్న చిన్నయ్య, కుమారి దంపతులు ఈ ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. ఒక బేల్దారీ మేస్త్రి వేధింపులు తాళ‌లేక వాళ్లు ఎలుకల మందు తాగారు. రూ.10 వేలు తీసుకుంటే రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అయితే వాళ్ళు డబ్బులు ఇవ్వకపోవడంతో ఆటో బేల్దారి మేస్త్రి స్వాధీనం చేసుకున్నాడు. డబ్బులు చెల్లించి ఆటో తీసుకెళ్లాల‌ని తేల్చి చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఎలుకల మందు తాగారు. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని ఇరుగు పొరుగు వారు వైద్యశాలకు తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement