Saturday, April 27, 2024

Breaking: టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా అరెస్టుకు రంగం సిద్ధం!

టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి కొడాలి నానిపై బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ నేతల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు.

చంద్రబాబు ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ప్రాణం తీస్తామంటూ వెంకన్న ఈ ఉదయం హెచ్చరించారు. చంద్రబాబు ఇంటిని టచ్ చేస్తే శవమై వెళ్తావని వార్నింగ్ ఇచ్చారు. దమ్ముంటే రా తేల్చుకుందామని సవాల్ విసిరారు.
ఇంత జరుగుతున్నా డీజీపీ స్పందించరా? అని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయనపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వెంకన్న వ్యాఖ్యలపై వివరణ తీసుకునేందుకు పెద్ద ఎత్తున పోలీసులు విజయవాడలోని ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసులు అక్కడకు చేరుకున్నారన్న సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement