Saturday, April 27, 2024

హామీ నెరవేర్చలేదని MLC ఇంటి ముట్టడి..

శ్రీసత్యసాయి జిల్లా చిలమర్తి మండలం తమ్మినాయనిపల్లి గ్రామానికి రోడ్డు వేస్తామంటూ 8 నెలల కిందట ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ హామీ నిరవేర్చకపోవడంతో గ్రామస్తులు ఎమ్మెల్సీ ఇంటిని ముట్టడించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు హిందూపురంలో వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ ఇంటిని గ్రామస్థులు ముట్టడించారు. ఇంట్లో ఎమ్మెల్సీ లేకపోవడంతో ఇంటి ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. వర్షాకాలంలో రోడ్డు దుస్థితి వల్ల అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. ప్రతీ రాజకీయ నాయకుడికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement