Friday, April 26, 2024

అనంత’లో మహిళా దారుణ హత్య

అనంతపురం క్రైమ్ – అనంత నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం నాడు నగరం లో చోటుచేసుకుంది కట్టుకున్న భర్త కాలయముడయ్యాడు. సంబంధిత పోలీసుల సమాచారం మేరకు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలానికి చెందిన చిక్కన్నయ్య. బెలుగుప్ప మండల కేంద్రానికి చెందిన కవితతో పదేళ్ల క్రితం వివాహం వీరికి ఇద్దరు పిల్లలు కూడా సంతానం . గత కొంతకాలం అనంతపురం నగరంలో టూ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీసెస్ నగర్ నందు నివాసం వుంటున్నారు భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య ప్రవర్తనపై అనుమానం కలిగి కట్టుకున్న భార్యను అతి దారుణంగా హత్యకు పాల్పడ్డాడు. భార్య వేరే వ్యక్తి తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నదిని అనుమానంతోనే భార్యను భర్త కడ తెరిచినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం. అందించడంతో సంకట స్థలాలకు నగర డీఎస్పీవీర రఘవరెడ్డి సి ఐ ఎస్ ఐ వెళ్లి పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement