Thursday, April 18, 2024

ఆలియా భట్​, సంజయ్​ లీలాభన్సాలీపై ముంబై కోర్టులో కేసు..

గంగూభాయి కఠియావాడీ మూవీ వివాదాలకు దారి తీస్తోంది. తన తల్లిని కించపరిచేలా సినిమా ఉందని పేర్కొంటూ గంగూభాయ్ దత్తపుత్రుడు బాబూ రావ్జీ షా కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తనపై, తన కుటుంబంపై సినిమా ప్రోమో, ట్రైలర్లరు ఎలాంటి ప్రభావం చూపిస్తాయని రావ్జీ వాటితో తాను అనుభవిస్తున్న మానసిక క్షోభ వర్ణించలేనినదని పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో ముంబై కోర్టు డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, హీరోయిన్ ఆలియా భట్ కు సమన్లు జారీ చేసింది. ఆ పిటిషన్ ను విచారించిన అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. మే 21లోపు కోర్టుకు రావాల్సిందిగా ఆలియా భట్, భన్సాలీ, సినిమా కథను రాసిన ఇద్దరు రైటర్లను ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement