Saturday, May 4, 2024

కొత్తచెరువు మండలంలో మొదలైన… జెడ్పిటిసి,ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం.

కొత్తచెరువు. – రాష్ట్రంలో స్థానిక సంస్థల(జడ్పిటిసి, ఎంపిటిసి)ఈ నెల 8 న ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల కావడంతో కొత్తచెరువు మండలంలో ఎన్నికల ప్రచారవేడి మొదలైంది మండలపరిధిలోని కేశపురం పంచాయతీలోని కే.వెంకటాపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో వైఎస్ఆర్.సిపి సీనియర్ నాయకులు కొండారెడ్డి,మండల కన్వీనర్ జగన్ మోహన్ రెడ్డి,కేశపురం, నాగిరెడ్డిపల్లి సర్పంచ్ లు నరేందర్ రెడ్డి, గొట్లూరు సంజీవరాయుడు,ఆధ్వర్యంలో జడ్పిటిసి అభ్యర్థి అలుగుండు గంగాదేవి,ఎంపీటీసీ అభ్యర్థులు కిష్టప్ప,గొడ్డల రఫీ,సాంబశివారెడ్డిలు పూజలు నిర్వహించిన అనంతరం మైలసముద్రం,కదిరేపల్లి వెంకటాపురం,తిరుమలదేవరపల్లి మైలపల్లి కనిశెట్టిపల్లి గ్రామాలలో ప్రతి ఇల్లిల్లూ తిరుగుతూ ఫ్యాను గుర్తుకు ఓటు వేసి జడ్పిటిసి,ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కొత్తచెరువు,కొడపగానిపల్లి సర్పంచ్ భర్తలు నాగరాజు,నరసింహారెడ్డి,వైసిపి నాయకులు నారేపల్లి రమణారెడ్డి,గోపాల్ రెడ్డి సుబ్బారావు,పెయింటర్ గిరి,చింతకాయల అశ్వర్థప్ప,బలిజ సంఘం సభ్యులు కడపగానిపల్లి శినా,రమేషు,గణేష్,రైస్ మిల్లు శేఖరా,బేల్దారి శీనా,సుధాకర్,బోయ కృష్ణమూర్తి,వడ్డే శీనా,పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement