Tuesday, April 30, 2024

లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్‌ చెక్కులు..

షాద్‌నగర్‌ : షాద్‌నగర్‌ నియోజకవర్గం కొత్తూర్‌ మండల పరిధిలోని 49 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ద్వారా మంజురైన రూ. 49,05,684లు కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్‌ చెక్కులను ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ మాట్లాడుతూ పేదలను ఆర్థికంగా అన్ని విధాల ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో కల్యాణ లక్ష్మీ, షాదిముబారక్‌, ఆసరా పించన్‌లు వంటి ప్రతిష్టాత్మక పథకాలను సిఎం కేసిఆర్‌ ప్రవేశపెట్టారని అన్నారు. పేదల కష్టాలను దృష్టిలో ఉంచుకోని ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైన సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తు అర్హులైన వారికి అందజేస్తుందని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్ర భుత్వం టిఆర్‌ఎస్‌ అని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మధుసూధన్‌రెడ్డి, జడ్పిటిసి శ్రీలత సత్యనారాయణ, వైస్‌ ఎంపిపి శోభలింగం నాయక్‌, ఎంపీడీఓ జ్యోతి, వివిధ గ్రామాల ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, కార్యకర్తలు, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement