Tuesday, May 14, 2024

ఇది ముమ్మాటికి ప్రభుత్వ హాత్యే..

షాద్‌నగర్‌ : కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునిల్‌ ఆత్మహత్య ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కాంగ్రెస్‌ నేత వీర్లపల్లి శంకర్‌ అన్నారు. నిరుద్యోగులు ధైర్యంగా ఉండండి ఆత్మహత్యల వల్ల ఉద్యోగాలు రావు. ప్రాణాలతో ఉండి ప్రభుత్వ మెడలు వంచుదామని అన్నారు. తెలంగాణలో ప్రభుత్వ నియామకాలు చేపడటం లేదని ఈ విషయం ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో కాకతీయ యూనివర్సిటీలో మార్చి 26వ తేదిన ఆత్మ హత్యకు ప్రయత్నించిన గూడూరు మండలం రాంసింగ్‌ తండాకు చెందిన విద్యార్థి సునిల్‌ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని వీర్లపల్లి శంకర్‌ పేర్కొన్నారు. ఇప్పటికైన ప్రభుత్వం కళ్లు తెరిచి గతంలో వేస్తామన్న నోటిఫికేషన్లు వేసి ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని అన్నారు. లేనియేడల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి ప్రభుత్వం కళ్లు తెరిపిస్తామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులు ధైర్యంగా ఉండండి ఆత్మహత్యల వల్ల ఉద్యోగాలు రావు. ప్రాణాలతో ఉండి ప్రభుత్వ మెడలు వంచుదామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement