టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి యువగళం పునఃప్రారంభమైంది. లోకేష్ పాదయాత్రకు టీడీపీ శ్రేణులు విశేషంగా తరలివచ్చాయి. తాటిపాక సభకు భారీ స్పందన లభించింది. దీనిపై ఆయన సతీమణి బ్రాహ్మణి స్పందించారు. నిన్ను చూసి ఎంతో గర్విస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, యువగళం పాదయాత్ర పునఃప్రారంభం ఫొటోలను పోస్ట్ చేశారు.
స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించడంతో లోకేష్ తన పాదయాత్రను మళ్లీ పట్టాలెక్కించారు. జనవరి 27న ప్రారంభమైన యువగళం సెప్టెంబరు 9న నిలిచిపోయింది. చంద్రబాబు అరెస్ట్ తో పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. మళ్లీ 79 రోజుల విరామం తర్వాత పాదయాత్ర మొదలైంది.