Wednesday, May 1, 2024

CPM Camapaign – ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండాను గెలిపించాలి : సీతారాం ఏచూరి

ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రజెండాను గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రజా సమస్యలను శాసనసభలో లేవనెత్తే జూలకంటి రంగారెడ్డిని గెలిపించాలని కోరారు. వేములపల్లి నుండి మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ చౌక్ వరకు ఏచూరీ రోడ్ షో కొనసాగింది. రోడ్ షోలో సీపీఎం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏచూరీ మాట్లాడుతూ.ఈ రోడ్ షో, ర్యాలీ చూసిన తర్వాత భవిష్యత్తులో రంగన్న ఎమ్మెల్యేగా ఉంటాడని అర్థమైందన్నారు. మిర్యాలగూడకు భవిష్యత్తు జూలకంటి రంగన్న అని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement