Saturday, May 4, 2024

గర్భిణీలకు..బాలింతలకు కరోనాపై అవగాహన..

పెద్దమందడి : మండల పరిధిలోని మంగంపల్లి గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్ నారాయణమ్మ గర్భిణీలకు..బాలింతలకు ఇంటింటికి తిరిగి కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. గ్రామంలోని గర్భిణికి కరోనా సోకడంతో కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. కరోనా వైరస్ పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. గర్భిణులు.. బాలింతలు కోడిగుడ్లు.. పాలు తీసుకోవాలని అన్నారు.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement