Tuesday, April 30, 2024

అడవిలోకి తీసుకెళ్లి భార్యను హత్య చేసిన భర్త…

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అయ్యప్పస్వామి టెంపుల్ సమీపంలోని అడవిలో మ‌హిళ‌ హత్యకు గురైంది. ఈ హ‌త్య భ‌ర్తే చేసి ఉంటాడ‌ని పోలీసులు భావిస్తున్నారు. వివ‌రాల‌లోకి వెళితే, గణపురం మండలం వెంకటేశ్వర రావుపల్లి గ్రామానికి చెందిన బండారి ఓదేలు (58) తన భార్య లక్షి (55)తో క‌లిసి ఆడ‌వికి వెళ్లారు. అయితే అక్క‌డ భార్య‌ను హత్య చేసి పరార‌య్యాడు.. స్థానికులు అడ‌విలో మృత‌దేహాన్ని చూసి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు… ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచార‌ణ చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement