Monday, May 6, 2024

పెద్దాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దాపురం ఏడీబీ రోడ్డుపై లారీని కారు ఢీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ఇరుక్కున్న ఐదుగురిలో నలుగురు మృతి చెందారు. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. తాళ్ళరేవు మండలం పెద్దవలస  నుంచి రాజమండ్రి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ నిద్రమత్తే ఇందుకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement