Sunday, May 26, 2024

AP : ఇవాళ క‌డ‌ప జిల్లాలో ష‌ర్మిల ప‌ర్య‌ట‌న

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నేడు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొంటున్నారు. ప్రొద్దుటూరు నియోజక వర్గంలో కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల ఎన్నికల ప్రచారం కొనసాగంచనున్నారు.

ఉదయం రామేశ్వరం 4 రోడ్ల జంక్షన్ వద్ద నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రొద్దుటూరులోని ఆర్ట్స్ కాలేజి క్రాస్ రోడ్, రిషి అపార్ట్మెంట్,వాసవి కళ్యాణ మండపం,భగత్ సింగ్ కాలనీ, సంజీవ్నగర్, శ్రీనివాస్‌న‌గ‌ర్, శివాలయంసెంటర్, జిన్నారోడ్, అమృతనగర్, ఖాదర్ బాద్ మీదుగా ప్రచారం కొనసాగించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement