Wednesday, April 24, 2024

పెద్దాపురం వ‌ద్ద కారు – లారీ ఢీః న‌లుగురు దుర్మ‌ర‌ణం….

పెద్దాపురంలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్ర‌మాదంలో ఓ శుభకార్యానికి కారులో బయలుదేరిన కుటుంబ సభ్యుల్లో నలుగురు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. తాళ్లరేవు మండలం పెద్దవలసకు చెందిన ఓ కుటుంబం గృహ ప్రవేశ వేడుక కోసం కారులో రాజమహేంద్రవరం బయలుదేరింది. ఈ క్రమంలో పెద్దాపురం ఏడీబీ రోడ్డుపై ఉన్న రుచి సోయా పరిశ్రమ వద్ద ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న 9 మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఐదు నెలల చిన్నారి కూడా ఉంది. కారు డ్రైవర్ నిద్రమత్తే ఇందుకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement