Sunday, May 12, 2024

TS: జీనోమ్‌ వ్యాలీని 250 ఎకరాల్లో విస్తరిస్తాం : మంత్రి కేటీఆర్‌

శామీర్ పేట, సెప్టెంబర్ 21(ప్రభ న్యూస్ ): జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తుర్కపల్లిలోని జినామ్ వ్యాలీలో యూరోఫిన్స్ బయోఫార్మా సర్వీసెస్ క్యాంపస్ ను మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించారు.

పరిశ్రమలకు టెస్టింగ్ సేవలను అందించడంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న యూరోఫిన్స్ క్యాంపస్ ను జినోమ్ వ్యాలీలో ప్రారంభించి మాట్లాడారు. జినోమ్ వ్యాలీ శక్తివంతమైన ఆర్ అండ్ డి పర్యావరణ వ్యవస్థకు మరొకటి యాడ్ అయినందున సంతోషిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement