Sunday, April 28, 2024

TS: గ్రూప్ 4లో మార్కులు తక్కువ వచ్చాయని యువతి సూసైడ్..

మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలం పెద్దముప్పారం గ్రామానికి చెందిన యువతి గ్రూప్ 4 లో మార్కులు తక్కువ వచ్చాయని హైదరాబాద్ లో సూసైడ్ చేసుకుంది. గ్రామానికి చెందిన గాదరబోయిన శిరీష (24) డిగ్రీ పూర్తి చేసి ఏడాది నుండి హైదరాబాద్ లోని జవహర్ నగర్ లోని ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతుంది.

ఇటీవల గ్రూప్ 4 రిజల్ట్ ను టీఎస్పీఎస్సీ విడుదల చేయగా.. తక్కువ మార్కులు రావడంతో మనస్తాపానికి గురైన శిరీష హాస్టల్ లో ఉరివేసుకుని మృతి చెందింది. డెడ్ బాడీని గాంధీ హాస్పటల్ ఉంచారు.. సాయంత్రం పెద్దముప్పారంలో దహన సంస్కారాలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement