Monday, May 20, 2024

మహిషాసుర మర్ధినిగా వరంగల్‌ భద్రకాళి

వరంగల్‌ భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన మంగళవారం భద్రకాళి అమ్మవారి మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సాయంత్రం ఆలయంలో అమ్మవారికి స్వభూపాల వాహనసేవ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సామూహిక కుంకుమార్చనలు, లక్ష్మీ అష్టోత్తర పూజలు జరుగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement