Sunday, May 12, 2024

అమరవీరులకు రంగవల్లులతో ఘన నివాళి

భూపాలపల్లి : జయశంకర్‌ జిల్లా భూపాలపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సీఐ రాజిరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా శనివారం రంగులతో పోలీస్‌ అమరుల స్థూపం, సీఎం కేసీఆర్‌ చిత్రపటం, డీజీపీ మహేందర్‌ రెడ్డి, జిల్లా ఎస్పీ సురేందర్‌ రెడ్డి చిత్రపటాలను కుప్పం నుండి వచ్చిన కళాకారుడు రంగవల్లులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల త్యాగాలు వెల కట్టలేనివని వారిని స్మరిస్తూ త్యాగ దనుల ఆశయ సాధనకు కృషి చేస్తున్నామన్నారు. వారి వెంట భూపాలపల్లి ఎస్సైలు రామకృష్ణ, స్వప్న ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement