Friday, April 26, 2024

ప్ర‌తి ఇంటికి ఒక మ‌రుగుదొడ్డిని నిర్మించుకోవాలి : మంత్రి ఎర్ర‌బెల్లి

మ‌హ‌బూబాబాద్ : ప్ర‌తి ఇంటికి ఒక మ‌రుగుదొడ్డిని నిర్మించుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. ప్రపంచ టాయిలెట్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని వెలిక‌ట్ట గ్రామంలో సంపూర్ణ స్వ‌చ్ఛ‌త కోసం స్వ‌చ్ఛ‌తా ర‌న్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డిని నిర్మించుకోవాలని, బ‌హిరంగ మ‌ల‌,మూత్ర విస‌ర్జ‌న‌ను నివారిద్దామ‌న్నారు. బ‌హిరంగ మ‌ల మూత్ర విస‌ర్జ‌న ర‌హిత రాష్ట్రంలో తెలంగాణ దేశంలోనే నంబ‌ర్ వ‌న్‌గా ఉంద‌న్నారు. వెలిక‌ట్ట గ్రామం ఈ రాష్ట్రానికి, దేశానికి ఆద‌ర్శం కావాల‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement