Thursday, May 16, 2024

సీపీఎం ఆధ్వర్యంలో హన్మకొండ కలెక్టరేట్ ముట్టడి

హన్మకొండ : అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. వందలాదిమంది సీపీఎం కార్యకర్తలు, గుడిసె వాసులతో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రోడ్డు పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలతో హోరెత్తించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడ్డది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను మార్గమధ్యలో ఆలేరు, జనగాం ప్రాంతంలో అరెస్టు చేసి పాలకుర్తి పోలీసు స్టేషన్ కు తరలించినట్లు సమాచారం. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కన్వీనర్ బొట్ల చక్రపాణి, నాయకులు చుక్కయ్య, ఉప్పలయ్య, మంద సంపత్, కిశోర్, రాగుల రమేష్, దొగ్గెల తిరుపతి, వీరన్న, గుడిసె వాసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement