Tuesday, May 14, 2024

కాళేశ్వరంలో మహారాష్ట్ర మాజీ సీఎం పూజలు

మహాదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో దక్షిణ అరణ్య శైవ క్షేత్రంగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈరోజు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రాణహిత పుష్కరాలను పురస్కరించుకొని, స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థాన అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి పాలాభిషేకాలు, శ్రీ శుభనంద (పార్వతీ) అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement