Monday, April 29, 2024

భూపాలపల్లి మున్సిపాలిటీ పుర వీధుల్లో గండ్ర పర్యటన

జయశంకర్ జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కార్లమార్క్స్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట సైడ్ డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణంకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. మంచి నీటి సమస్యపై కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగా.. వెంటనే స్పందించి మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని ప్రతి ఇంటికి అందించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement