Saturday, April 27, 2024

గుండెపోటుతో రైతు మృతి

మల్హర్ : మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన మోగిలి కొమురయ్య (52) గుండె పోటుతో బుధవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కుటుంబీకుల‌ వివరాల్లోకి వెళ్లగా.. నిన్న‌ ఉదయం పొలం పనులకు వెళ్లిన కొమురయ్య పొలం ప‌నుల్లో ఉండ‌గా హ‌ఠాత్తుగా గుండెపోటుకు గుర‌య్యాడు. రాత్రి వరకు కొమురయ్య రాకపోయేసరికి కుటుంబీకులు పొలం వద్దకు వెళ్లగా పొలంలో పడి ఉన్న కొమురయ్యను చూసి అతన్ని బయటకు తీసుకు వచ్చేసరికి మృతి చెందినట్లు తెలిసింది. మృతునికి ఇద్దరు కూతుర్లు, కొడుకు, భార్య ఉన్నారు. పొలంలో మృతి చెందిన రైతుని ప్రభుత్వం ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement