Saturday, May 4, 2024

ఆషాఢ మాసం.. మహిళల గోరింటాకు సంబరాలు

తొర్రూర్ టౌన్, (ప్రభ న్యూస్) : ఆషాఢం వచ్చిందంటే అతివలు గోరింటాకు సంబరాలు చేసుకుంటారు. ఈ మాసంలో పెళ్లయిన మహిళలు తల్లిగారింటికి చేరుకుంటారు. పెళ్ళికాని యువతులు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే వారికి సకల గుణాలను కలిగిన వరుడు దొరుకుతాడని భావిస్తారు. అదేవిధంగా పెళ్లి అయిన వారు త‌మ చేతులు ఎర్రగా పండితే సౌభాగ్యం గా భావిస్తారు. వ‌రంగ‌ల్ జిల్లాలోని తొర్రూరులో వాసవి మాత కిట్టి పార్టీలో మహిళలు ఆటపాటలతో గడిపాడు. తమ చేతులకు గోరింటాకు పెట్టుకొని సంద‌డి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement